రాష్ట్రంలో భూగర్భ జలమట్టం(GROUNDWATER LEVELS) మూడు మీటర్లకు పైగా పెరిగింది. ఈ ఏడాదిలో జులై వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 48శాతం అధిక వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు కూడా పెరిగాయి. జూలై నెలలో రాష్ట్ర భూగర్భ జలమట్టం సగటు 6.07 మీటర్లుగా నమోదైంది.
మొత్తం 33 జిల్లాలకుగాను 11 జిల్లాల్లో ఐదు మీటర్ల లోపే ఉండగా.. 20 జిల్లాల్లో ఐదు నుంచి పది మీటర్ల లోపు ఉంది. రెండు జిల్లాల్లో మాత్రమే 10 మీటర్లకు పైగా ఉంది. నిరుడితో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ భూగర్భ జలాలు పెరిగాయి. గత పదేళ్లతో పోలిస్తే రాష్ట్రంలోని 592 మండలాలకుగాను 579 మండలాల్లో పెరుగుదల ఉందని భూగర్భజల శాఖ తెలిపింది.