తెలంగాణ

telangana

By

Published : May 9, 2020, 4:11 PM IST

ETV Bharat / state

చిరు వ్యాపారులకు సరుకుల పంపిణీ

కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్​డౌన్​తో చిరు వ్యాపారులకు ఉపాధి కరవైంది. తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తోన్న వారికి తెలంగాణ ఏరియా స్వదేశి జాగరన్ మంచ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు.

groceries to street vendors and migrant labor at ambarpet in Hyderabad
చిరువ్యాపారులకు సరుకుల పంపిణీ

లాక్​డౌన్​తో ఉపాధి లేక ఇబ్బంది పడుతోన్న వలస కార్మికులు, చిరు వ్యాపారులకు తెలంగాణ ఏరియా స్వదేశీ జాగరన్ మంచ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. హైదరాబాద్​ అంబర్​పేట్​లో రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల నుంచి వచ్చిన చిరు వ్యాపారుల ఇళ్లకు వెళ్లి సరుకులు పంపిణీ చేశారు.

లాక్​డౌన్​ వల్ల జీవనోపాధి కోల్పోయిన వారిని ఆదుకోవడానికి దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకురావాలని జాగరన్ సభ్యులు కోరారు. కార్మికులంతా మరికొన్ని రోజులు సంయమనం పాటించి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details