తెలంగాణ

telangana

నాటి మిత్రులంతా కలిశారు... పేదల కడుపు నింపారు

By

Published : Apr 17, 2020, 7:47 PM IST

2002-03 సంవత్సరపు పదో తరగతి విద్యార్థులు. ప్రస్తుంతం ఉద్యోగులు. వారందరినీ ఏకం చేసింది లాక్​డౌన్ పరిస్థితి. లాక్​డౌన్​ వేళ పేదలు పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూసి చలించిన గాంధీనగర్​ కానిస్టేబుల్​... తమ చిన్నానాటి మిత్రులందరితో కలిసి అండగా ఉండేందుకు ముందుకొచ్చారు.

GROCERIES DISTRIBUTION TO POOR PEOPLE
నాటి మిత్రులంతా కలిశారు... పేదల కడుపు నింపారు

లాక్​డౌన్​ వేళ ఇబ్బందులు ఎదుర్కొంటున్న బడుగులకు కొందరు పాత స్నేహితుల బృందం చేయూతనిచ్చింది. విజయనగరం జిల్లాకు చెందిన గాంధీనగర్ పోలీస్​స్టేషన్ కానిస్టేబుల్​ శంకర్​రావు అప్పలనాయుడుతో పాటు 2002-03 పదో తరగతి మిత్రులందరూ కలిశారు. హైదరాబాద్​లోని ఇందిరా పార్కు సమీపంలో ఉండే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆకలిని గుర్తించారు.

దాదాపు అరవై మంది మిత్ర బృందం డబ్బులు పోగు చేసి... బియ్యం, కందిపప్పు, కూరగాయలు, గోధుమపిండి , నూనె, శానిటైజర్, రెండు రకాల పండ్లతో కలిపి 15 రకాల ఆహార పదార్థాలు అందించాలని నిర్ణయించుకున్నారు. తమ ఆలోచనలు అమలు చేసేందుకు గానూ పోలీసుల సాయం తీసుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలోనే పేదలకు సరుకులను పంపిణీ చేశారు. నాటి మిత్ర బృందం చేస్తోన్న సేవ అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు.

నాటి మిత్రులంతా కలిశారు... పేదల కడుపు నింపారు
నాటి మిత్రులంతా కలిశారు... పేదల కడుపు నింపారు
నాటి మిత్రులంతా కలిశారు... పేదల కడుపు నింపారు

ఇదీ చూడండి:సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

ABOUT THE AUTHOR

...view details