తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2021, 5:35 PM IST

ETV Bharat / state

'తీర్మానం చేసి నిధులు ఖర్చు చేసుకోవచ్చు'

గ్రామపంచాయతీల నిధులను పై అధికారుల అనుమ‌తులు లేకుండానే, ఆయా గ్రామప్రజలు, పంచాయతీల తీర్మానం మేరకు ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్థానిక అవసరాల మేరకు నిధులను ఖర్చుచేసుకునే వెసులుబాటు పంచాయతీలకు లభించనుంది.

errabelli dayakar rao
ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు

రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్​లకు శుభవార్త చెప్పింది. గ్రామపంచాయతీల నిధులను పై అధికారుల అనుమ‌తులు లేకుండానే, ఆయా గ్రామప్రజలు, పంచాయతీల తీర్మానం మేరకు ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామస‌భ ఆమోదం మేర‌కు గ్రామ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆయా ప‌నులను నిబంధ‌న‌ల మేర‌కు ఆర్థిక సంవ‌త్సర కేటాయింపుల‌కు మించ‌కుండా మాత్రమే ఖ‌ర్చు చేయాల‌ని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

తాజా ఉత్తర్వుతో ఇప్పటికే ప‌ల్లె ప్రగ‌తితో అభివృద్ధి, పారిశుద్ధ్యం, ప‌చ్చద‌నం ప‌రుచుకున్న ప‌ల్లెలు ఇక ప్రగ‌తిలోనూ మ‌రింత‌గా ప‌రుగులు పెడ‌తాయ‌ని పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. వెంట‌నే ఉత్తర్వు జారీ చేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్​కు కృత‌జ్ఞత‌లు తెలిపారు. గ‌తంలో ల‌క్ష లోపు ప‌నుల‌కు డీపీఓలు, ఆపై పనుల‌కు ఉన్నతాధికారుల అనుమ‌తులు అవ‌స‌రం ఉండేదని... తాజా ఉత్తర్వులతో ఎవరి అనుమ‌తులు అవ‌స‌రం లేకుండానే.. సంక్రమించే అధికారాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని స‌ర్పంచులు, ఉపస‌ర్పంచులు, వార్డు స‌భ్యులు, ప్రజ‌ల‌కు పిలుపునిచ్చారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ప‌ల్లె ప్రగ‌తి కార్యక్రమాన్ని చేప‌ట్టిన సీఎం... తాజా జీఓతో గ్రామాలు మ‌రింత వేగంగా అభివృద్ధి చెంద‌డానికి వీలు కల్పించారని ఎర్రబెల్లి అన్నారు. ఎక్కడ ఎలాంటి వివాదాల‌కు తావు లేకుండా, నిధుల దుర్వినియోగం జ‌ర‌గ‌కుండా, ప‌నులు నాణ్యంగా జ‌రిగేలా గ్రామ‌పంచాయ‌తీల బాధ్యులు న‌డుచుకోవాల‌ని సూచించారు.

ఇదీ చదవండి:'సాగర్' అభ్యర్థి ఎంపికపై సీనియర్​ నేతలతో చర్చించనున్న బండి

ABOUT THE AUTHOR

...view details