మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదుకై ఇప్పటివరకు 34,514 దరఖాస్తులు అందినట్లు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి పంకజ తెలిపారు. అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేందుకు వీలుగా 178 మంది డిజిగ్నేటడ్ అధికారులను నియమించినట్లు వెల్లడించారు.
జోరుగా ఓటరు నమోదు... 34వేలకు పైగా దరఖాస్తులు
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి అక్టోబర్ 1నుంచి ఇప్పటివరకు 34,514 దరఖాస్తులు వచ్చినట్లు ఈఆర్వో పంకజ తెలిపారు. నవంబర్ 6వరకు గడువు ఉన్న నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జోరుగా ఓటరు నమోదు... 34వేలకు పైగా దరఖాస్తులు
అధికారులు పట్టభద్రుల నుంచి ఫారం-18 క్లైమ్లను తీసుకొని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో అప్లై చేసుకునేవారు... http://www.ceotelangana.nic.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేయవచ్చని వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 6 వరకు గడువు ఉన్నట్లు ఈఆర్వో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస గెలుపు తథ్యం: కేటీఆర్