తెలంగాణ

telangana

ETV Bharat / state

డీఎంఈని తొలగించాల్సిందే...

క్యారీడ్ అడ్వాన్స్​మెంట్ స్కీం పెంచిన తరువాతనే వయోపరిమితి మీద నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్​ కోఠిలో ప్రభుత్వ వైద్యులు ఆందోళనకు దిగారు. స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకున్న డీఎంఈ రమేష్​రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

By

Published : Jun 18, 2019, 11:45 PM IST

డీఎంఈని తొలగించాల్సిందే...

హైదరాబాద్ కోఠి వైద్య, విద్యా సంచాలకుల కార్యాలయం ముందు ప్రభుత్వ వైద్యులు ఆందోళనకు దిగారు. క్యారీడ్ అడ్వాన్స్​మెంట్ స్కీం పెంచిన తరువాతనే వయోపరిమితి మీద నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఈవిషయంలో జూనియర్ డాక్టర్స్​తో ప్రభుత్వం చర్చలు జరిపి తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. దీనిపై ఒకప్పుడు వ్యతిరేకించిన డీఎంఈ ఇప్పుడు ఎవరితో చర్చించకుండా వయోపరిమితి మీద నిర్ణయం తీసుకోవడం సరైనది కాదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకున్న డీఎంఈ రమేష్​రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని వైద్యుల సంఘము నాయకులు డిమాండ్ చేశారు.

డీఎంఈని తొలగించాల్సిందే...

ABOUT THE AUTHOR

...view details