తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజ్​భవన్​లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం...

'వైద్యురాలిగా, రాజకీయ నేతగా తమిళనాడు ప్రజలకు సేవ చేశాను. మీకెలాంటి సమస్యలున్నా నన్ను నేరుగా కలిసి మాట్లాడొచ్చు': తమిళిసై సౌందర్ రాజన్, గవర్నర్

By

Published : Jan 15, 2020, 3:12 PM IST

governor thamilisi
రాజ్​భవన్​లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం...

ప్రజలకు మరింత అందుబాటులో ఉండటానికి రాజ్ భవన్​లో నెలలో ఒకరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తామని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వైద్యురాలిగా, రాజకీయ నేతగా తమిళనాడులో ప్రజలకు సేవ చేశానని... రాజ్ భవన్​ను ప్రజాభవన్​గా భావించి ప్రజలు తమ సమస్యలు తనకు చెప్పుకోవచ్చని తమిళిసై సూచించారు.

తమిళనాడు, తెలంగాణలో చారిత్రక ప్రాంతాలెన్నో ఉన్నాయని... ఇరు రాష్ట్రాల మధ్య పర్యాటకంగా పర్యటించేందుకు తగిన ఏర్పాటు చేయాలని తమిళిసై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతానని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.

రాజ్​భవన్​లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం...

ఇవీ చూడండి: కాంగ్రెస్ సవాల్​ని స్వీకరిస్తున్నా... పుర ప్రచారానికి 'బయటికి' రాను!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details