ప్లవ నామ సంవత్సరం తెలుగు వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరికీ మహమ్మారి రహిత ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలందరూ ఈ ఉగాది పండుగను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలన్నారు.
Governor Ugadi Wishes
కరోనా మహమ్మారిని అత్యంత ధైర్య సాహసాలతో ఎదుర్కొని విజయం సాధించాలని హృదయ పూర్వకంగా ఆశిస్తున్నానని తమిళిసై పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ప్రభుత్వం సమయానుసారంగా ఇచ్చే అన్ని సూచనలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉందామనే సంకల్పం తీసుకొందామని గవర్నర్ పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి:ఈసారి నిరాడంబరంగా ఉగాది వేడుకలు: రాష్ట్ర ప్రభుత్వం