తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై చర్చ - governor tamilisai on corona

రోజురోజుకూ కరోనా కేసులు తీవ్రమవుతోన్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఇవాళ ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చించనున్నారు. కొవిడ్ నిర్వహణతో పాటు పరీక్షలు, చికిత్స, బిల్లులకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై గవర్నర్ దృష్టి సారించనున్నారు. ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, వైద్య-ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శికి రాజ్ భవన్ నుంచి పిలుపు అందింది.

governor tamilisai will meet privet hospitals delegates  in hyderabad
ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై చర్చ

By

Published : Jul 7, 2020, 2:30 AM IST

రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పరీక్షలు, చికిత్సలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో స్వయంగా వైద్యురాలైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య-ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారిని గవర్నర్ రాజ్ భవన్​కు పిలిచారు.

గవర్నర్ ట్వీట్

ఈ విషయాన్ని తమిళిసై స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొవిడ్ ఐసోలేషన్ వసతి కల్పిస్తున్న ఆసుపత్రుల ప్రతినిధులతో ఇవాళ ఉదయం 11 గంటలకు తమిళిసై చర్చిస్తారు. కరోనా చికిత్స సహా సంబంధిత అంశాలపై గవర్నర్ చర్చించనున్నారు. పరీక్షలు, పడకలు, బిల్లులకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఈ విషయాలను కూడా తమిళిసై ట్వీట్ చేశారు. గవర్నర్ ట్వీట్ పై స్పందించిన పలువురు నెటిజన్లు... కరోనా చికిత్స, తదితరాలకు సంబంధించిన పలు సమస్యలు, అంశాలను ప్రస్తావించారు.

ప్రభుత్వానికి సూచనలు

వాటన్నింటినీ నోట్ చేసుకున్నానని, పరిష్కారంపై దృష్టి సారిస్తామని గవర్నర్ తిరిగి సమాధానం ఇచ్చారు. మూడు నెలలుగా తన వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నానన్న తమిళిసై... ప్రభుత్వానికి సూచనలు చేయడంతో పాటు నిమ్స్ ఆస్పత్రిని సందర్శించినట్లు చెప్పారు. కాళోజీ విశ్వవిద్యాలయ ఉపకులపతితోపాటు కొవిడ్ చికిత్స అందిస్తోన్న ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతోనూ మాట్లాడినట్లు గవర్నర్ వివరించారు.

ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details