కొవిడ్ మూడోదశను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. వైరస్ రెండో దశ ముప్పు తొలగిపోలేదన్న గవర్నర్ తమిళిసై.. ఇటీవలే మంత్రి కేటీఆర్ హైదరాబాద్ వెంగళరావునగర్లో ప్రారంభించిన కొవిడ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. కాల్సెంటర్ పనితీరు మెచ్చుకున్నారు.
Governor tamilisai: 'కొవిడ్ మూడోదశను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి' - hyderabad district news
కొవిడ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు.. ప్రభుత్వ గొప్ప ఆలోచన అని గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ వెంగళరావు నగర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఉన్న కొవిడ్ కంట్రోల్ కేంద్రాన్ని గవర్నర్ పరిశీలించారు. రాష్ట్రంలో లక్ష్యం మేరకు టీకా కార్యక్రమం కొనసాగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
![Governor tamilisai: 'కొవిడ్ మూడోదశను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి' governor tamilisai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12268683-1079-12268683-1624693907879.jpg)
వార్ రూమ్, కాల్సెంటర్ ద్వారా వైద్య సేవలు అందించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. కరోనా బాధితులకు అందుబాటులో ఉన్న పడకలు, ఔషధాలు, అంబులెన్సులు, వ్యాక్సిన్ తదితర సమాచారాన్ని కొవిడ్ కంట్రోల్ కేంద్రంలో అందిస్తున్నట్లు గవర్నర్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి టీకా డోసులు పంపిణీ చేసిన వైద్యారోగ్యశాఖకు గవర్నర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో లక్ష్యం మేరకు టీకా కార్యక్రమం కొనసాగుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:MAA ELECTIONS: 'నాగబాబు వ్యాఖ్యలు తప్పుబట్టిన నరేశ్'