రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్యానికి సంబంధించి రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాలపై చర్చించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలుపై గవర్నర్ తమిళిసై ప్రస్తావించారు. గతంలో గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ సమయంలోనూ ఈ పథక అమలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఉన్నాతాధికారులతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
2లక్షల నుంచి 5లక్షల వరకు...
ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలో 946 రకాల వైద్య సేవలు అందిస్తుండగా.. ఆయుష్మాన్ భారత్ అమలైతే వాటి సంఖ్య 1,350కి పెరగనున్నట్లు కేంద్ర అధికారులు వివరించినట్లు సమాచారం. ఒక్కో కుటుంబానికి ఆరోగ్య శ్రీ కింద రూ. 2లక్షల వరకు వైద్య సేవలు అందిస్తుండగా అది 5 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.