కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలకు రాజ్ భవన్ ప్రతి రోజూ భోజనం సమకూరుస్తోంది. రాజ్భవన్లో భోజనం సిద్ధం చేసి ప్రతి రోజూ వంద మందికి చొప్పున అందిస్తున్నారు. అక్కడకు వచ్చే వారికి వస్త్రంతో చేసిన మాస్క్లను ఇస్తున్నారు.
రాజ్భవన్లో భోజనంతో పాటు మాస్కులు
నిరుపేదలకు రాజ్భవన్ ప్రతి రోజూ భోజనం అందిస్తోంది. భోజనంతో పాటు వస్త్రంతో మాస్కులను ఇస్తున్నారు. మాస్కులను గవర్నర్ తమిళిసై పరిశీలించి.. టైలర్లను అభినందిచారు.
governor tamilisai
రాజ్ భవన్లోని టైలర్లు ప్రతి రోజూ 60 నుంచి 70 మాస్కులను తయారు చేస్తున్నారు. మాస్కులను పరిశీలించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... టైలర్లను అభినందించారు.
ఇదీ చూడండి:ఆ దుకాణంలో అమ్మేవాళ్లు లేరు... కానీ కొనుక్కోవచ్చు!