రాఖీపౌర్ణమి వేడుకలను రాజ్భవన్లో వినూత్నంగా జరిపారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్లాస్మాదాతలను సన్మానించి రక్షాబంధన్ నిర్వహించారు. జీవితాలను నిలబెట్టిన వారికి రాఖీలు, మిఠాయిలు అందించడంతోపాటు శాలువాలతో సన్మానించారు. రాజ్భవన్ దర్బారు హాల్లో జరిగిన కార్యక్రమంలో 13 మంది ప్లాస్మా దాతలను తమిళిసై అభినందించారు.
పలుమార్లు ప్లాస్మా దానం
ప్లాస్మా దాతలు తమ అనుభవాలను వివరించడంతోపాటు తామూ ఎలా స్ఫూర్తి పొందామో వివరించారు. ఒక్కసారి మాత్రమే కాకుండా పలుమార్లు ప్లాస్మాను దానం చేసిన వారిని గవర్నర్ ప్రశంసించారు. ఇతరులను కూడా ప్రోత్సహించాలని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు మార్లు ప్లాస్మా దానం చేసిన ముంబయి ఐఐటీ విద్యార్థి నితిన్ కుమార్ను తమిళిసై ప్రత్యేకంగా అభినందించారు. రెండు సార్లు ప్లాస్మా దానం చేసిన శివప్రతాప్, ఉమర్ ఫారూఖీ, అఖిల్, రూపదర్శిని తదితరులు రెండు మార్లు ప్లాస్మా దానం చేశారు.