ప్రభువు స్తుతి గురించి పాడటమే కాకుండా మనమందరం ఆచారించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్ భవన్లో నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన మార్గములను అనుసరించుట ద్వారా అద్భుతమైన సామరస్యాన్ని పొందవచ్చన్నారు.ఈ వేడుకలకు రాజ్భవన్ ఉద్యోగులు తమ కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు.
సెమి క్రిస్మస్ వేడుకల్లో గవర్నర్ తమిళిసై
శాంతి, సామరస్యాన్ని, సార్వత్రిక సోదరభావాన్ని యేసుక్రీస్తు నేర్పించారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. క్రీస్తు ప్రేమలో ఉండి మీరు కూడా శాంతిని, సమాధానాన్ని పొందవచ్చని పేర్కొన్నారు.
సెమి క్రిస్మస్ వేడుకల్లో గవర్నర్ తమిళిసై