మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న భక్తులకు ఆ దేవదేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా వుండాలని, తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలను, శాంతిని ప్రసాదించాలని ఆ గరళకంఠున్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంకిత భావం, శ్రద్ధా భక్తులతో ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని కొవిడ్ నిబంధనలకు లోబడి జరపుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు - telangana varthalu
గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు దేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు