దేశ ప్రతిష్ఠను పెంపొందించడానికి కృషి చేయాలని ట్రైనీ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. ఐఎఫ్ఎస్ 2020 బ్యాచ్ ట్రైనీ అధికారులు ముతినేని సాయి తేజ, కాసారపు ప్రేమ్ సాగర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ మాట్లాడారు.
దేశ ప్రతిష్ఠను పెంపొందించండి: గవర్నర్ తమిళిసై - Telangana news
ఐఎఫ్ఎస్ 2020 బ్యాచ్ ట్రైనీ అధికారులు ముతినేని సాయి తేజ, కాసారపు ప్రేమ్ సాగర్లతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఐఎఫ్ఎస్కు ఎంపికైనందుకు గవర్నర్ వారిని అభినందించారు.

ఐఎఫ్ఎస్
ఐఎఫ్ఎస్కు ఎంపికైనందుకు గవర్నర్ వారిని అభినందించారు. దేశంలో, విదేశాల్లో భారత్ పేరును పెంపొందించటంలో ఐఎఫ్ఎస్ల పాత్ర కీలకమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట సానుకూలంగా మారుతోందన్నారు. కరోనా టీకా 150 దేశాలకు సరఫరా చేయటం వల్ల దేశానికి మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఆర్టీపీసీఆర్ పరీక్షలపై హైకోర్టు అసంతృప్తి