తెలంగాణ

telangana

నాగార్జున సాగర్‌లో లాంచీ ప్రయాణానికి అనుమతి

By

Published : Apr 16, 2021, 2:26 PM IST

నాగార్జున సాగర్‌లో లాంచీ ప్రయాణానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాగర్‌ ఒడ్డు నుంచి నాగార్జునకొండకు రాకపోకలు సాగనున్నాయి. పద్దెనిమిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత లాంచీల రాకపోకలు జరగనున్నాయి.

government-permission-to-launch-at-nagarjuna-sagar
నాగార్జున సాగర్‌లో లాంచీ ప్రయాణానికి అనుమతి

పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్‌లో లాంచీ ప్రయాణానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సాగర్‌ ఒడ్డు నుంచి నాగార్జునకొండకు రాకపోకలు సాగించనున్నాయి. పద్దెనిమిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత.. గుంటూరు జిల్లా విజయ పురిసౌత్‌లోని సాగర్ లాంచీ స్టేషన్ నుంచి.. లాంచీల కదలనున్నాయి.

2019లో గోదావరిలో పడవ ప్రమాదం నేపథ్యంలో.. ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల్లో లాంచీల రాకపోకలపై నిషేధం విధించింది.

ఇదీ చదవండి:లైవ్ వీడియో- చేపల వేటకు వెళ్లి నీటిలో గల్లంతైన వ్యక్తి

ABOUT THE AUTHOR

...view details