ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీ గూడెం కొత్తవీధి మండలంలో పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గుమ్మలరేవు పంచాయతీలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రం నిర్వహించేందుకు.. వీరు దారకొండ నుంచి ట్రాక్టర్పై వెళ్తుండగా.. కొంగ పాకల తాత్కాలిక కల్వర్టు వద్ద వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ప్రవాహంలో చిక్కుకుంది.
వరద ప్రవాహం.. గ్రామస్థుల సహాయం.. ప్రభుత్వ సిబ్బందికి తప్పిన ప్రమాదం - government employees escaped from floods in visakha news
స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణకు వెళ్తుండగా ప్రభుత్వ సిబ్బంది వరద నీటిలో చిక్కుకున్న ఘటన ఏపీలోని విశాఖ ఏజెన్సీ గూడెం కొత్తవీధిలో జరిగింది. సమీపంలోని గ్రామస్థుల సహకారంతో సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేరి.. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
![వరద ప్రవాహం.. గ్రామస్థుల సహాయం.. ప్రభుత్వ సిబ్బందికి తప్పిన ప్రమాదం వరద ప్రవాహం.. గ్రామస్థుల సహాయం.. ప్రభుత్వ సిబ్బందికి తప్పిన ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8434401-607-8434401-1597505545160.jpg)
వరద ప్రవాహం.. గ్రామస్థుల సహాయం.. ప్రభుత్వ సిబ్బందికి తప్పిన ప్రమాదం
భారీ వర్షాలకు కల్వర్టు పైనుంచి నీరు ప్రవహిస్తుండగా.. వరద ఉద్ధృతికి ట్రాక్టర్ మధ్యలోకి వెళ్లే సరికి ఒరిగిపోయి మట్టిలో కూరుకుపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురై.. రక్షించాలంటూ కేకలు వేశారు. సమీపంలోని గ్రామస్థులు అక్కడకు చేరుకుని వారిని ఒడ్డుకు చేర్చారు . అనంతరం కాలినడకన గుమ్మిరేవుల చేరుకుని కార్యక్రమం నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఇదీ చూడండి:వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఆరా