తెలంగాణ

telangana

By

Published : Nov 5, 2020, 7:06 PM IST

ETV Bharat / state

ధరణిని సమర్థంగా, పారదర్శకంగా నిర్వహించాలి: సీఎస్​

ధరణి పోర్టల్​ను సమర్థంగా, పారదర్శకంగా సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు. ధరణి పోర్టల్ ద్వారా స్లాట్లు బుక్ చేసుకున్న వారి రిజిస్ట్రేషన్లు అదే రోజు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోర్టల్​ను ఇప్పటి వరకు 5 లక్షల 84 వేల మంది వీక్షించారని, ఇప్పటి వరకు 2,622 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని సీఎస్ తెలిపారు.

ధరణిని సమర్థంగా, పారదర్శకంగా నిర్వహించాలి: సీఎస్​
ధరణిని సమర్థంగా, పారదర్శకంగా నిర్వహించాలి: సీఎస్​

ధరణి పోర్టల్ ద్వారా స్లాట్లు బుక్ చేసుకున్న వారి రిజిస్ట్రేషన్లు అదే రోజు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్​ కుమార్ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్.. పోర్టల్​ను సమర్థంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరికీ ఎలాంటి విచక్షణాధికారాలకు తావు లేకుండా పని చేయాలన్న ఆయన.. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోర్టల్​ను ఇప్పటి వరకు 5 లక్షల 84 వేల మంది వీక్షించారని, ఇప్పటి వరకు 2,622 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని సీఎస్ తెలిపారు. ఇప్పటి వరకు 5,971 స్లాట్ బుకింగ్స్ జరగ్గా 6,239 మంది రూ. 7 కోట్ల 77 లక్షలు చెల్లించాలని సీఎస్ చెప్పారు. బీఆర్కే భవన్​లో ఏర్పాటు చేసిన ధరణి కంట్రోల్ రూంను సోమేశ్​ కుమార్ సందర్శించారు. వంద మంది సభ్యుల బృందం సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ధరణి పోర్టల్ పనితీరు సంతృప్తికరంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ధరణి పోర్టల్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details