అవినీతికి అడ్డాగా తెరాస మారిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కేటీఆర్ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో అక్రమంగా కట్టడాలు జరుగుతున్నాయని విమర్శించారు. అయినా మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెరాసపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు - తెలంగాణ వార్తలు
తెరాసపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నేతృత్వంలోనే హైదరాబాద్లో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెరాస అవినీతికి అడ్డాగా మారిందని మండిపడ్డారు.

అవినీతి అడ్డాగా తెరాస... కేటీఆర్ ఆశీర్వాదంతోనే...: రాజాసింగ్
అవినీతి అడ్డాగా తెరాస... కేటీఆర్ ఆశీర్వాదంతోనే...: రాజాసింగ్
ఇప్పటివరకు ఏ ఒక్క బిల్డర్పై అక్రమ కట్టడాల గురించి చర్యలు తీసుకోలేదని రాజాసింగ్ అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, అధికారులకు ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందన లేదని మండిపడ్డారు.
ఇదీ చదవండి:భాజపా గూటికి దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి