వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సంగీత్ చౌరస్తాలో కార్లు, ద్విచక్ర వాహనదారులకు ఆయన అవగాహన కల్పించారు.
ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి : సీఐ శ్రీనివాస్ - రోడ్డు భద్రతా మాసోత్సవాలు
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్లేనని గోపాలపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాహనదారులకు ఆయన అవగాహన కల్పించారు.
ద్విచక్ర వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్మెట్ ధరించాల్సిందేనని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు, గంటకు 40 కీలోమీటర్లకు మించి వేగంగా వాహనాలను నడపరాదని సూచించారు. సిగ్నల్స్ జంప్ చేయడం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందన్న ఆయన కార్లు నడిపేవారు సీటు బెల్టు ధరించాలని చెప్పారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాన్ని నడపడం, త్రిబుల్ డ్రైవింగ్ లాంటి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు బాలకృష్ణ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీపై హైకోర్టులో విచారణ