కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి గోపాలం విద్యాసాగర్ ప్రకటించారు. పార్టీలో దిగజారుడు రాజకీయాలు భరించలేకే రాజీనామా చేశానని ఆయన చెప్పుకొచ్చారు.
'అధికార పార్టీతో ఉత్తమ్, భట్టి లోపాయికారి ఒప్పందం'
కాంగ్రెస్ పార్టీలో దిగజారుడు రాజకీయాలు భరించలేకే రాజీనామా చేసినట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి గోపాలం విద్యాసాగర్ ప్రకటించారు. త్వరలోనే తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు.
'అధికార పార్టీతో ఉత్తమ్, భట్టి లోపాయికారి ఒప్పందం'
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధికార పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని పార్టీని భ్రస్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:తెరాస గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల... ముఖ్యాంశాలివే