తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మూడు ఉత్సవమూర్తుల కిరీటాలు మాయమయ్యాయి.ఈ ఘటనపై తితిదే సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి విచారణ చేపడుతున్నారు. ఆలయ అధికారులను, సిబ్బందిని తితిదే విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో ఉన్న సీసీ టీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో పడింది. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఘటనా స్థలికి చేరుకున్నారు.