తెలంగాణ

telangana

By

Published : Apr 12, 2020, 4:16 PM IST

ETV Bharat / state

లాక్​డౌన్​ పూర్తయ్యే నాటికి నగరంలో మార్పులు: మేయర్

లాక్​డౌన్​ పూర్తయ్యే నాటికి నగరంలో ఎన్నో మార్పులు వస్తాయని జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ అన్నారు. రద్దీ లేకపోవడం వల్ల నగరంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

ghmc mayor visit development works in various places
లాక్​డౌన్​ పూర్తయ్యే నాటికి నగరంలో మార్పులు: మేయర్

లాక్​డౌన్​ కాలాన్ని జీహెచ్​ఎంసీ యంత్రాంగం సద్వినియోగం చేసుకుంటోంది. రద్దీ లేకపోవడం వల్ల రాత్రింబవళ్లు రోడ్డు విస్తరణ పనులు, వంతెన నిర్మాణాలు చేపడుతోంది. ఎల్బీనగర్, బైరామల్​గూడ, కామినేని, శేరిలింగంపల్లిలో ఇప్పటికే పనులు వేగవంతం చేస్తున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్​ తెలిపారు. నగరంలో జరుగుతున్న పనులను మేయర్ పర్యవేక్షించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రహదారులు, 500 అండర్​పాస్​లు, నాలా విస్తరణ పనులపై నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నట్టు మేయర్ తెలిపారు. ఎస్​ఆర్డీపీ పనుల్లో భాగంగా ఎల్బీ నగర్​లో పైవంతెన నిర్మాణానికి అడ్డుగా ఉన్న మైసమ్మ దేవాలయాన్ని తొలిగించారు. యుద్ధ ప్రాతిపదికన అవకాశం ఉన్న అన్ని పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. లాక్​డౌన్​ పూర్తయ్యే నాటికి నగరంలో ఎంతో మార్పు వస్తుందని మేయర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

లాక్​డౌన్​ పూర్తయ్యే నాటికి నగరంలో మార్పులు: మేయర్

ఇవీ చూడండి:చికెన్​ బిర్యానీ పెట్టలేదని కరోనా రోగికి కోపమొచ్చింది!

ABOUT THE AUTHOR

...view details