హైదరాబాద్ జియాగూడలోని పేదలకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ నిత్యావసరాలను పంపిణీ చేశారు. జియాగూడ రంగనాథ స్వామి దేవాలయ ప్రధానార్చకుడు శేషాచారి, బంకట్లు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో... మేయర్ పాల్గొని 200 మందికి సరుకులను అందజేశారు. ఈనెల 23వ తేదీ నుంచి నేటివరకు సుమారు 27 వేల మంది పేదలకు నిత్యావసరాలను పంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
నిత్యావసరాలు పంచిన బొంతు రామ్మోహన్
లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ జియాగూడలోని పేదలకు మేయర్ బొంతు రామ్మోహన్ నిత్యావసరాలు పంచిపెట్టారు. స్థానిక రంగనాథ స్వామి ఆలయ ప్రధానార్చకుడు శేషాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
నిత్యావసరాలు పంచిన బొంతు రామ్మోహన్