ఏడు పెద్ద సంస్థలకు బల్దియా భారీ జరిమానా హైదరాబాద్లో నిబంధనలు అతిక్రమించి పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి బల్దియా, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం భారీగా జరిమానాలు విధించింది. గతేడాది అక్టోబరు నుంచి సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి విజిలెన్స్ విభాగం జరిమానాలు విధిస్తోంది. జరిమానాలు కట్టకుండా అలసత్వంతో భారీగా పేరుకపోయిన ఏడు పెద్ద సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
జరిమానా విధించబడిన సంస్థలు:
సంస్థ | జరిమానా(రూ.లలో) |
ది న్యాచురల్ హెయిర్ ట్రిమ్ మెంట్ | 39,56000 |
ది బ్రిటిష్ స్పోకేన్ ఇంగ్లీష్ | 33,62000 |
ది వెంకట్ జాబ్స్ ఇన్ ఎంఎన్సీ | 29,44000 |
ఆక్ట్ ఫైబర్ నెట్ | 14,19000 |
ది ర్యాపిడో బైక్ టాక్సీ | 13,79000 |
ది బిల్స్ సాఫ్ట్ టెక్నాలజీస్ | 9,38000 |
ది హత్ వే బ్రాడ్ బాండ్ | 8,13000 |
ఈ సంస్థలు వెంటనే జరిమానాలు చెల్లించాలని.. లేదంటే చర్యలు తీసుకుంటామని ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ హెచ్చరించారు.
ఇవీ చూడండి: డబ్ల్యుూఈఎఫ్కు రెండోసారి హాజరవనున్న కేటీఆర్