తెలంగాణ

telangana

By

Published : Nov 28, 2020, 6:56 AM IST

ETV Bharat / state

ఈ ఎన్నికలు హైదరాబాద్‌ - భాగ్యనగరం మధ్య: అసద్​

జీహెచ్​ఎంసీ ఎన్నికలు హైదరాబాద్‌-భాగ్యనగరం మధ్య జరుగుతున్నాయని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ పేర్కొన్నారు. హైదరాబాద్‌ పేరును సంస్కృతిని కాపాడుకొనేందుకు ప్రతి ఒక్కరు కలిసిరావాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో బహిరంగ సభల్లో అసద్​ పాల్గొన్నారు.

MP Asaduddin Owaisi
MP Asaduddin Owaisi

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో గెలుపొందేందుకు భాజపా నాయకులు సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ​ విమర్శించారు. సర్జికల్‌ స్ట్రైక్‌ను తిప్పికొట్టేందుకు డిసెంబర్‌ 1 పోలింగ్‌ తేదీన ప్రజలు ఓటేసి డెమెక్రటిక్ స్ట్రైక్‌తో సమాధానం చెప్పాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్వాన్‌, షేక్‌పేట్‌, మలక్‌పేట ప్రాంతాల్లో బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ ఎన్నికలు హైదరాబాద్‌-భాగ్యనగరం మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ పేరును సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :బండి సంజయ్​, అక్బరుద్దీన్​పై కేసులు నమోదు చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details