తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీ అభివృద్ధి గల్లీ బాయ్స్ వల్లే సాధ్యం: కేటీఆర్

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్​ నియోజకవర్గంలోని వనస్థలిపురం రైతుబజార్​ వద్ద పురపాలక మంత్రి కేటీఆర్... రోడ్​షో నిర్వహించారు. తనదైన ప్రసంగంతో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. జీహెచ్​ఎంసీ అభివృద్ధికి కట్టుబడిన తెరాసకే ఓటేయాలని మంత్రి సూచించారు.

By

Published : Nov 23, 2020, 9:37 PM IST

జీహెచ్​ఎంసీ అభివృద్ధి గల్లీ బాయ్స్ వల్లే సాధ్యం: కేటీఆర్
జీహెచ్​ఎంసీ అభివృద్ధి గల్లీ బాయ్స్ వల్లే సాధ్యం: కేటీఆర్

పేదవారికి సాయం చేస్తే.. మీరు దీపాలు పెట్టమంటే దీపాలు పెడ్తం.. డాన్సులు చేయమంటే డాన్సులు చేస్తం. హైదరాబాద్​ వరదలపై ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాస్తే ఇప్పటివరకు ఉలుకుపలుకులేదు. జన్​ధన్ ఖాతాలు తెరిస్తే.. ధన్​ధన్​మని పైసలు వేస్తామని ఇంతవరకు వేయలేదు. అమిత్​షా గారు మీరు మాకు ఇచ్చిందేం లేదు. సొమ్ము తెలంగాణది... సోకు దిల్లీది. భాజపాపై 132 కోట్ల మంది ప్రజలు ఛార్జ్​షీట్లు వేస్తరు. భాజపా ఎల్బీనగర్​ నియోజవర్గానికి ఏంచేసిందో చెప్పాలి. వరదసాయం అందజేస్తుంటే ఆపింది మీరు కాదా? పేదవాడి నోటికాడి ముద్దను లాక్కుంది మీరు కాదా? మమ్మల్ని గెలిపించండి రూ. 25 వేలు ఇస్తం అంటున్నరు. రూ. 10వేలు ఆపినోళ్లు... రూ. 25 వేలు ఇస్తరా? వాళ్లకు తెలిసింది ఒక్కటే హిందూ- ముస్లిం. పంచాయితీ పెట్టాలే... నాలుగు ఓట్లు, నాలుగు సీట్లు సంపాదించాలే... అవుతలపడాలే... ఇదే వాళ్లకు తెలిసింది. పేదల పక్షపాతి ప్రభుత్వం తెరాస. ఆరేళ్ల నుంచి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నం. హైదరాబాద్​ ప్రజలు నిర్ణయించాలి... ఎట్లాంటి నాయకత్వం కావాల్నో. తెలంగాణలో పక్కాలోకల్ పార్టీ తెరాసనే. గల్లీ పార్టీకి ఓటేస్తారా? దిల్లీ పార్టీకి ఓటేస్తారా? మీరే నిర్ణయించుకోండి. వనస్థలిపురం అభివృద్ధి కావాలంటే గల్లీ బాయ్స్ వల్లే అవుతుంది. దిల్లీ బాయ్స్ వల్ల కాదు.

----- వనస్థలిపురం రోడ్​షోలో మంత్రి కేటీఆర్

వనస్థలిపురంలో మంత్రి కేటీఆర్ రోడ్​షో

ఇదీ చూడండి:ఒక్కటే బాకీ ఉంది... అది కూడా నెరవేరుస్తా: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details