తెలంగాణ

telangana

ETV Bharat / state

వనస్థలిపురంలో జీహెచ్​ఎంసీ కమిషనర్​ పర్యటన - GHMC Commissioner Lokesh Kumar Latest news

కంటైన్​మెంట్​ జోన్​గా ఉన్న హైదరాబాద్​లోని వనస్థలిపురం హుడా సాయినగర్​లో జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోక్​శ్​కుమార్​ పర్యటించారు. పోలీసు, జీహెచ్ఎంసీ, వైద్యఆరోగ్య శాఖ అధికారులను అడిగి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.

జీహెచ్​ఎంసీ కమిషనర్​
జీహెచ్​ఎంసీ కమిషనర్​

By

Published : May 9, 2020, 9:58 PM IST

హైదరాబాద్​లోని వనస్థలిపురం హుడా సాయినగర్​లో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్ పర్యటించారు. ఈ కాలనీలో నివాసముండే 9 మందికి కరోనా పాజిటివ్ రాగా... వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ తరుణంలో హుడా సాయినగర్​లో పర్యటించిన లోకేశ్ కుమార్ అక్కడి పరిస్థితులపై పోలీసు, జీహెచ్ఎంసీ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బీపీ, షుగర్, డయాలిసిస్ రోగులతో పాటు వృద్ధులు, గర్భిణీల కోసం తీసుకుంటున్న జాగ్రత్త చర్యలపై ఆరా తీశారు. స్థానిక కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్​ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ కరుణ, ఉప వైద్యాధికారి భీమా నాయక్​లు వనస్థలిపురంలోని పరిస్థితిని కమిషనర్​కు వివరించారు.

ఇవీచూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details