తెలంగాణ

telangana

ETV Bharat / state

'భాగ్యనగరంలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు' - ghmc commissioner lokesh kumar on corona virus precaution taken in hyderabad

రాష్ట్ర రాజధానిలో కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు నగరవ్యాప్తంగా స్ప్రేయింగ్​ చేయిస్తున్నట్లు జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్​కుమార్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారందరికీ క్వారంటైన్​ స్టాంప్స్​ వేస్తామని చెప్పారు.

ghmc commissioner lokesh kumar on corona virus precaution taken in hyderabad
'భాగ్యనగరంలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు'

By

Published : Mar 21, 2020, 7:36 PM IST

హైదరాబాద్​లో కరోనా వైరస్ కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. విదేశాల నుంచి వచ్చే వారి వివరాలు సేకరిస్తున్నామని.. ఇప్పటి వరకు నగరంలో 13 వేల మంది విదేశాల నుంచి వచ్చారన్నారు. వారందరికీ క్వారైంటెన్ స్టాంప్స్ వేయనున్నట్లు వెల్లడించారు. స్టాంప్ వేసిన తర్వాత క్వారంటైన్​లో ఉన్నారా లేదా అనేది పరిశీలిస్తామన్నారు.

రేపు పారిశుద్ధ్య సిబ్బంది యథావిధిగా విధులు నిర్వహిస్తారని.. నగర ప్రజలు జనతా కర్ఫ్యూ లో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇప్పటికే ప్రధాన ఏరియాల్లో సోడియం, పైతో క్లోరైడ్​తో స్ప్రేయింగ్ చేస్తున్నామన్నారు. కరోనా లక్షణాలుంటే వెంటనే 108 కాల్ చేయాలని... ప్రత్యేక సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలిస్తామని పేర్కొన్నారు.

'భాగ్యనగరంలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు'

ఇవీ చూడండి:ప్రపంచంపై కరోనా పంజా.. 10వేలకు చేరిన మరణాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details