తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రేటర్​లో నీరు వృథా చేస్తే నల్లా కనెక్షన్ కట్'

భాగ్యనగరంలో నీటి వృథాను తగ్గించేందుకు అధికారులు వినూత్న కార్యక్రమానికి తెర తీశారు. ఇకపై నీరు ఎక్కువగా వృథా చేసే ఇంటికి నల్లా కనెక్షన్​ తొలగించాలని నిర్ణయించారు. అంతే కాకుండా నీటి వాడకం, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి అంశాలను బట్టి ఇళ్లకు రంగులతో కూడిన గుర్తులను కేటాయించనున్నారు. తడి, పొడి చెత్తను వేరుచేయడం, నీటి వృథాను అరికట్టడం వంటి అంశాలపై జీహెచ్​ఎంసీ కమిషనర్​ చందానగర్​లోని పలు ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు.

By

Published : Aug 23, 2019, 4:31 PM IST

Updated : Aug 23, 2019, 5:10 PM IST

దానకిశోర్​ పర్యటన

హైదరాబాద్​ చందానగర్​ పరిధిలోని స్టాలిన్​నగర్​, ప్రశాంత్​నగర్​, ఎంఏ నగర్​లలో వాటర్​ వర్క్స్​ ఎండీ, జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ పర్యటించారు. నీటి వృథా అవగాహన, సాఫ్​ హైదరాబాద్​ కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటికీ తిరిగి నీటి వృథాను అరికట్టడం, తడి, పొడి చెత్తను వేరుచేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోనల్​ కమిషనర్​ హరిచందన, ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జీహెచ్​ఎంసీ వినూత్న కార్యక్రమం

భాగ్యనగరంలో నీటి వృథాను అరికట్టడానికి జీహెచ్​ఎంసీ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇకపై నీరు ఎక్కువగా వృథా చేసే ఇంటికి నల్లా కనెక్షన్​ తొలగించాలని నిర్ణయించారు. నీటి వాడకంపై ప్రతి ఇంటికి రంగులతో గుర్తులను వేయనున్నారు. ఎక్కువగా నీరు వృథా చేసే ఇళ్లకు ఎరుపురంగు, నీరు పొదుపు చేస్తూ... ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్న ఇళ్లకు నీలం రంగు, ఇంకుడు గుంతలు లేని ఇళ్లకు ఆకుపచ్చ రంగును గుర్తులుగా వేయనున్నారు.

నీటి వృథా అరికట్టేందుకు జీహెచ్​ఎంసీ కమిషనర్​ అవగాహన

ఇదీ చూడండి : 'స్వచ్ఛభారత్​లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి'

Last Updated : Aug 23, 2019, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details