హైదరాబాద్లోని పంజగుట్ట సర్కిల్లో అంబేడ్కర్ విగ్రహం ప్రతిష్ఠ అనంతరం జరిగిన ఘటనలపై జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత అర్ధరాత్రిఅంబేడ్కర్విగ్రహన్ని కమిటీ నాయకులు ఏర్పాటు చేశారు. అందుకు అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ సిబ్బంది విగ్రహన్ని తొలగించి యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తరలించారు. ఈ క్రమంలో విగ్రహం వాహనం నుంచి కింద పడి ధ్వంసం అయిందని పేర్కొన్నారు. ఈ దురదృష్టకర ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని వెల్లడించారు.
అంబేడ్కర్ విగ్రహ వివాదంపై దాన కిశోర్ విచారం - అంబేద్కర్ విగ్రహ వివాదంపై దాన కిశోర్ విచారం
హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్ట ప్రధాన కూడలిలో నిన్న అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహం తొలగింపుపై జీహెచ్ఎంసీ స్పందించింది. విగ్రహం ధ్వసం అయిన ఘటనలో బాధ్యలైన అధికారులను తొలగించామని కమిషనర్ దాన కిశోర్ వెల్లడించారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ను కోరినట్లు స్పష్టం చేశారు.
![అంబేడ్కర్ విగ్రహ వివాదంపై దాన కిశోర్ విచారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2994177-thumbnail-3x2-dana1.jpg)
అంబేద్కర్ విగ్రహ వివాదంపై దాన కిశోర్ విచారం
బాధ్యులెవరైనా వదిలిపెట్టాం
ఈ ఘటనపై అంతర్గత విచారణను జరపాలని నగర పోలీసు కమిషనర్ను కోరినట్లు దాన కిశోర్ స్పష్టం చేశారు. ఇందుకు బాధ్యులైన యూసుఫ్గూడ యార్డ్ ఆపరేటర్ బాలాజీని తొలగించినట్లు పేర్కొన్నారు.
అంబేడ్కర్ విగ్రహ వివాదంపై దాన కిశోర్ విచారం
ఇవీ చూడండి: అనుమతి లేకుండా అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహావిష్కరణ