వర్షాకాలంలో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని... జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన మహిళలకు అవగాహన కల్పించారు. సాప్ సంస్థ ప్రారంభించి 100 రోజులు పూర్తైన సందర్భంగా చందానగర్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో.. సినీనటి సోనీ చటర్జీతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు పలు సూచనలు చేశారు. తడి, పొడి చెత్త ద్వారా మహిళలు ఆదాయాన్ని పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.
'తడి, పొడి చెత్తతో ఆదాయం పొందండి' - 'తడి, పొడి చెత్తతో ఆదాయం పొందండి'
వర్షాకాలంలో చెత్త విషయంలో జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ నగరవాసులకు సూచిస్తోంది. తడి, పొడి చెత్త విషయంలో సహకరించాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషన్ హరిచందన కోరారు. తడి, పొడి చెత్త విషయంలో ఆదాయం పొందే మార్గంపై సూచన చేశారు.
!['తడి, పొడి చెత్తతో ఆదాయం పొందండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3783928-876-3783928-1562599150098.jpg)
'తడి, పొడి చెత్తతో ఆదాయం పొందండి'
'తడి, పొడి చెత్తతో ఆదాయం పొందండి'
ఇవీ చూడండి: కాళేశ్వరంలో పరుగులు పెడుతున్న గోదారమ్మ