వినాయక నిమజ్జన(ganesh Immersion) ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ(GHMC) దృష్టి సారించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్(CP Anjani kumar) ఇతర అధికారులతో కలిసి ట్యాంక్ బండ్(tank bund), పీవీ ఎన్ఆర్(pvnr), ఎన్టీఆర్ మార్గ్ల్లో(ntr marg) సందర్శించారు.
అధికారుల పరిశీలన
ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల చేపట్టిన సుందరీకరణకు ఎలాంటి నష్టం జరగకుండా... నిర్ణయించిన ప్రదేశాల్లో మాత్రమే నిమజ్జనం జరుగుతుందని అర్వింద్ కుమార్ వెల్లడించారు. పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జనం కోసం అదనపు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
హైకోర్టు విచారణ
వినాయక నిమజ్జనం సందర్భంగా అమలు చేయదగిన ఆంక్షలు, నియంత్రణ చర్యలను సూచించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు(telangana high court) ఇటీవలె ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యచరణ సమర్పించాలని అదేవిధంగా గణేశ్ ఉత్సవసమితి, పిటిషనర్ కూడా నివేదికలు ఇవ్వాలని కోరింది. హుస్సేన్ సాగర్లో(hussain sagar) గణేశ్ నిమజ్జనాన్ని నిషేధించాలని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ గతంలో దాఖలు చేసిన పిటిషన్పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ధర్మాసనం ఇటీవలె విచారణ చేపట్టింది.