కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. వినాయకుడి పూజకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు కోరారు.
సామూహిక నిమజ్జనం లేదు..
సెప్టెంబర్ 1న సామూహిక నిమజ్జనం వీలుకాదని.. భక్తులు సామాజిక దూరం పాటిస్తూ జరుపుకోవాలన్నారు. సహజ నీటి వనరులు ఉన్న చోట తక్కువ మందితో సాదా సీదాగా నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు.