తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇప్పటి పాలనను చూస్తే.. గాంధీ ఆత్మక్షోభిస్తుంది: ఉత్తమ్‌ - latest news on uttam kumar reddy

భారతీయ జనతా పార్టీ.. గాంధీ సిద్ధాంతాలను పక్కన పెట్టి.. మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. భాజపాకు గాంధీని తాకే అర్హత లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Gandhi's soul is disturbed by the current regime: Uttam
ఇప్పటి పాలనను చూస్తే.. గాంధీ ఆత్మ క్షోభిస్తుంది: ఉత్తమ్‌

By

Published : Jan 30, 2020, 3:10 PM IST

మహాత్మాగాంధీ సిద్ధాంతాలే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. భాజపా గాంధీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి.. మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని ఆయన ఆరోపించారు. మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గాంధీభవన్‌లో ఉత్తమ్ నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు ఘనంగా నివాళులర్పించారు.

భాజపాకు గాంధీని తాకే అర్హత లేదని ఉత్తమ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతోన్మాద పార్టీ మజ్లిస్‌తో భాజపా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఉత్తమ్‌ విమర్శించారు. తెరాస సైతం భాజపా, మజ్లిస్‌తో దోస్తీ చేస్తుందని.. అందుకే భైంసా ఘటనపై స్పందించలేదన్నారు.

ఈ మూడు పార్టీలు గాంధీ సిద్దాంతాలను పక్కకు పెట్టి.. మత రాజకీయాలు చేస్తున్నాయని ఉత్తమ్‌ దుయ్యబట్టారు. ఇప్పుడున్న పాలనను చూస్తే.. గాంధీ ఆత్మ క్షోభిస్తుందని ఆయన తెలిపారు.

ఇప్పటి పాలనను చూస్తే.. గాంధీ ఆత్మ క్షోభిస్తుంది: ఉత్తమ్‌

ఇవీచూడండి:జైలు నుంచి విడుదలయ్యాడు.. మళ్లీ అదే బాట పట్టాడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details