తెలంగాణ

telangana

ETV Bharat / state

'టీచర్లను భర్తీ చేయకుండా... కేజీ టూ పీజీనా...?'

పాఠశాలలు పునఃప్రారంభించే సమయం దగ్గరపడినా... ఉపాధ్యాయుల భర్తీ చేపట్టని ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.

By

Published : Jun 11, 2019, 1:25 PM IST

జీవన్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి డిమాండ్​ చేశారు. కె.జీ నుంచి పీజీ ఆంగ్ల విద్యను అందిస్తామన్నా కేసీఆర్ ఇప్పుడెందుకు టీచర్​ కొలువులు భర్తీ చేయట్లేదని మండిపడ్డారు. టీఆర్​టీ అభ్యర్థులను ఎంపిక చేసి కూడా వారికెందుకు ఉద్యోగాలు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నప్పటికీ ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీల విషయంలో ఏలాంటి చర్యలను తీసుకోకపోటవం సరికాదని పేర్కొన్నారు. ఫలితంగా విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.

జీవన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details