తెలంగాణ

telangana

గాంధీ గుడి.. 150వ జయంతి వేడుకలు

By

Published : Oct 1, 2019, 6:45 AM IST

శాంతి, అహింసలే ఆయుధాలుగా స్వాతంత్య్రం కోసం బ్రిటిషర్లతో పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ. ఒక్క భారత్​కు మాత్రమే కాదు.. అనేక దేశాల ప్రజలకు మార్గదర్శిగా గాంధీజీ నిలిచాడని జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జున రావు తెలిపారు.

గాంధీ గుడి.. 150వ జయంతి వేడుకలు

యావత్ ప్రపంచానికే శాంతి మార్గాన్ని చూపిన మహాత్మా గాంధీని స్మరించుకోవడం నిజంగా అదృష్టమని జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జున రావు పేర్కొన్నారు. దిల్లీ ఎయిర్ పోర్టు సమీపంలోని ఉదాన్ భవన్​లో జరిగిన కార్యక్రమంలో గ్రంధి మల్లికార్జున రావు పాల్గొన్నారు. అనంతరం మహాత్మా గాంధీ దేవాలయం క్యాలెండర్​ను ఆయన ఆవిష్కరించారు. మహాత్మునికి గుడి కట్టి నిత్య పూజలు చేస్తున్న చారిటి సభ్యులను ఆయన అభినందించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలోని గాంధీ గుడి ఆధ్వర్యంలో మహాత్ముని 150వ జయంతికి కొత్త క్యాలెండర్​ను రూపొందించారు.

గాంధీ గుడి.. 150వ జయంతి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details