హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడ నుంచి వచ్చే రసాయన నాలా పారిశ్రామిక వ్యర్థ జలాలను మోసుకొచ్చి హుస్సేన్ సాగర్లో కలుపుతోంది. అక్కడి నుంచి ఓ నాలా లోయర్ ట్యాంక్ బండ్, గాంధీనగర్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్తోంది. హుస్సేన్ సాగర్ నుంచి మురుగు నీరంతా ఈ నాలా గుండా బయటికి వెళ్తోంది. అదే ఇక్కడి పరిసర నివాసితులకు శాపంగా మారుతోంది. గాంధీనగర్ పరిధిలో నాలా పరివాహక ప్రాంతాల్లో మురుగు, రసాయన వ్యర్థాలు వెదజల్లే ఘాటు వాసనలు ఓ సమస్య కాగా... ఇక్కడ నాలాపై రక్షణ గోడ లేకపోవడం మరో సమస్యగా మారింది.
కునుకు లేదు...