రాష్ట్రవ్యాప్తంగా మహాత్మగాంధీ 152వ జయంతి వేడుకలు (Gandhi Jayanti ) ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర సమరంలో బాపు పాత్రను గుర్తుచేసుకుంటూ.... ప్రముఖులు ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ లంగర్హౌస్లోని బాపూ ఘాట్లో గాంధీ జయంతి వేడుకలు (Gandhi Jayanti at Bapu Ghat )నిర్వహించారు.
Gandhi Jayanti: బాపూఘాట్లో గాంధీ జయంతి వేడుకలు.. నివాళి అర్పించిన గవర్నర్, స్పీకర్, మంత్రులు - Governor Tamil Sai paying tributes at Bapu Ghat
హైదరాబాద్ లంగర్ హౌస్లోని బాపూ ఘాట్లో (Gandhi Jayanti at Bapu Ghat )గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయ, మంత్రులు కేటీఆర్, తలసాని, శ్రీనివాస్ గౌడ్, సభాపతి పోచారం నివాళులు అర్పించారు.

governor
బాపూ ఘాట్ వద్ద గవర్నర్ తమిళిసై, హరియాణా గవర్నర్ దత్తాత్రేయ నివాళులు అర్పించారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీఆర్, తలసాని, శ్రీనివాస్, మహమూద్ అలీ, సత్యవతి గౌడ్లు.. గాంధీకి పూలమాలలతో నివాళులు అర్పించారు. జాతిపిత చూపిన బాటలో ప్రతి నాయకుడు పయనించాలని సూచించారు.
Gandhi Jayanti: బాపూఘాట్లో గాంధీ జయంతి వేడుకలు.. నివాళి అర్పించిన గవర్నర్, స్పీకర్, మంత్రులు
ఇదీ చూడండి: pocharam srinivas reddy tribute to gandhi: గాంధీ బాటలోనే నడుస్తున్నాం: పోచారం