తెలంగాణ

telangana

By

Published : Oct 3, 2019, 10:22 AM IST

ETV Bharat / state

'గాంధీ ఆశయాలకు అనుగుణంగా జీవించాలి'

ప్రతిఒక్కరు  మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఆదర్శంగా జీవించాలని గాంధీ గ్లోబల్​ ఫ్యామిలీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్​రెడ్డి అన్నారు. గాంధీజీ 150వ జయంతి వేడుకలను రంగారెడ్డి జిల్లా కుంట్లూరు గాంధేయం బీఈడీ   కళాశాలలో ఘనంగా నిర్వహించారు.

గాంధీజీ 150వ జయంతి వేడుకలు

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ మండలం కుంట్లూరులో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15 మంది చేనేత కార్మిక మహిళలు రాట్నంతో నూలు ఒడికారు. 350 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. గాంధీ వేషధారణలో ఉన్న బాలుడు నూలు ఒడుకుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఎప్పటికైనా ప్రజలు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా జీవించి ఆదర్శంగా ఉండాలని ప్రభాకర్ రెడ్డి సూచించారు.

గాంధీజీ 150వ జయంతి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details