తెలంగాణ

telangana

By

Published : Aug 26, 2019, 1:25 PM IST

ETV Bharat / state

అనిశా కోర్టుకు హాజరైన గాలి జనార్దన్ రెడ్డి

బెయిల్‌ కుంభకోణం కేసులో గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ అనిశా కోర్టుకు హాజరయ్యారు. ఆ కేసు విచారణను సెప్టెంబర్‌ 12కు న్యాయస్థానం వాయిదా వేసింది.

అనిశా కోర్టుకు హాజరైన గాలి జనార్ధన్ రెడ్డి

బెయిల్ కుంభకోణం కేసులో నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి ఇవాళ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. సాక్షిగా ఉన్న సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి నాగమారుతి శర్మ కూడా హాజరయ్యారు. గతంలో ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఆ కేసులో బెయిల్ కోసం సీబీఐ కోర్టు అప్పటి న్యాయమూర్తి పట్టాభికి గాలి జనార్దన్ రెడ్డి బృందం లంచం ఇచ్చారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది.

పట్టాభికి లంచం ఇవ్వడానికి ముందు మరో న్యాయమూర్తి నాగమారుతి శర్మను ప్రభావితం చేసేందుకు నిందితులు ప్రయత్నించారని ఏసీబీ అభియోగం. లంచం తీసుకుని బెయిల్ ఇచ్చేందుకు నాగమారుతి శర్మ నిరాకరించారని ఏసీబీ పేర్కొంది. ఆ కేసులో సాక్ష్యం చెప్పేందుకు నాగమారుతి శర్మ ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. న్యాయస్థానం పాక్షికంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది.

అనిశా కోర్టుకు హాజరైన గాలి జనార్ధన్ రెడ్డి

ఇదీ చూడిండి : ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

ABOUT THE AUTHOR

...view details