సంచలనం రేపిన కార్తీక్ హత్య కేసులో మరో ఆరుగురిని అరెస్ట్ చేసి... రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 29న కార్తీక్ అనే వ్యక్తిని హత్యచేసి కొండపల్లి సమీపంలోని నెట్టెంపాడు కాలువలో పూడ్చిపెట్టారు.
'కార్తీక్ హత్య కేసులో మరో ఆరుగురి అరెస్ట్' - Gadwal DSP Srinivas reddy press meet
జోగులాంబ గద్వాల జిల్లా బురదపేటలో ఈనెల 29న జరిగిన కార్తీక్ హత్య కేసులో మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇదివరకే రవి, వసంత్, అనిల్ అనే ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
!['కార్తీక్ హత్య కేసులో మరో ఆరుగురి అరెస్ట్' Murder Case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6285163-450-6285163-1583256403567.jpg)
'కార్తీక్ హత్య కేసులో మరో ఆరుగురి అరెస్ట్'
'కార్తీక్ హత్య కేసులో మరో ఆరుగురి అరెస్ట్'
ఈ హత్యోదంతంలో బోయ వీరేశ్, బండి సునీల్, కురువ రంజిత్, బోయ రాజేశ్, తెలుగు భీమ్లను తాజాగా అరెస్ట్ చేసినట్లు గద్వాల డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తొలుత రవి, వసంత్, అనిల్ అనే ముగ్గుర్ని అరెస్టు చేశారు. మొత్తం తొమ్మిది మందిని రిమాండ్కు తరలించామన్నారు. మరో మైనర్ బాలున్ని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి :రొమాంటిక్ క్రైమ్ కథ: ఓ ప్రియుడిని మరో ప్రియుడితో చంపించింది..