తెలంగాణ

telangana

ETV Bharat / state

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్​ పునఃప్రారంభం - gaddiannaram fruit market starts today

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్​ను ఇవాళ్టి నుంచి పునః ప్రారంభించి.. మామిడి, బత్తాయి క్రయవిక్రయాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. భౌతిక దూరం పాటించడానికి వీలుగా లారీల్లోని దిగుబడులను ప్లాట్‌ఫాంలపై అన్‌లోడ్‌ చేయకుండానే వేలం పాటలు నిర్వహించి విక్రయించనున్నారు

gaddiannaram fruit market starts today
నేడు గడిఅన్నారం పండ్ల మార్కెట్​ పునఃప్రారంభం

By

Published : May 19, 2020, 7:04 AM IST

Updated : May 19, 2020, 7:52 AM IST

హైదరాబాద్​లోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ నేటి నుంచి పునః ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్‌లో మామిడి, బత్తాయి క్రయవిక్రయాలు నిర్వహించేందుకు నిర్ణయించి సోమవారం రాత్రి నుంచే యార్డులోకి మామిడి, బత్తాయి దిగుమతులను అనుమతించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించడానికి వీలుగా లారీల్లోని దిగుబడులను ప్లాట్‌ఫాంలపై అన్‌లోడ్‌ చేయకుండానే వేలం పాటలు నిర్వహించి విక్రయించనున్నారు. రైతులందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కమిటీ సభ్యులు కోరారు.

ఇవీ చూడండి: అమాయకుల భూమి.. అధికారులు తారుమారు చేశారు!

Last Updated : May 19, 2020, 7:52 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details