తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుణ్ని కోల్పోయాం: ఈటల - Mahaprasthanam Crematorium

మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు మృతి తీరని లోటని మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. తెలంగాణ ఓ అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుణ్ని కోల్పోయిందని వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం ఎంఎస్​ఆర్​ అంత్యక్రియలు హైదరాబాద్​లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.

Mahaprasthanam Crematorium
Mahaprasthanam Crematorium

By

Published : Apr 27, 2021, 1:12 PM IST

మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం హైదరాబాద్​లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. కరోనా బారిన పడిన ఎమ్మెస్సార్​ ఈ తెల్లవారుజామున నిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన​ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​ను ఆదేశించారు.

మహాప్రస్థానంలో మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో అధికారిక లాంఛనాలతో సత్యనారాయణరావు అంత్యక్రియలు జరగనున్నాయి. నిమ్స్ ఆసుపత్రిలో ఎమ్మెస్సార్ పార్థివదేహం వద్ద వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. తెలంగాణ ఓ అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుణ్ని కోల్పోయిందన్న ఈటల... ఆయన​ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి:ఇక డిజిటల్‌ ఉపాధి శకం- నైపుణ్యాలకు గిరాకీ

ABOUT THE AUTHOR

...view details