తెలంగాణ

telangana

By

Published : Jul 4, 2020, 7:44 PM IST

ETV Bharat / state

ఏవోబీ సరిహద్దులో సంపూర్ణ లాక్​డౌన్​

కరోనా మహమ్మారి వ్యాప్తిచెందకుండా అన్ని ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ప్రధానంగా జనసమూహం ఉండే ప్రాంతాలను తగ్గించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ  ఏవోబీలో ఒడిశా ప్రభుత్వం ఈ నెలంతా శని, ఆదివారాల్లో సంపూర్ణ లాక్​డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

full lockdown in visakha boarder aob
ఏవోబీ సరిహద్దులో సంపూర్ణ లాక్​డౌన్​

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ఒడిశా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. విశాఖపట్నం సరిహద్దు అయిన ఏవోబీలోని కోరాపుట్టు జిల్లాలో నెలరోజులు పాటు వారాంతంలో సంపూర్ణ లాక్​డౌన్​ అమలుచేస్తున్నారు.

ఈరోజు సరిహద్దులోని ఓనకడిల్లి, మాచ్​ఖండ్, జోలపుట్ గ్రామాల్లో దుకాణాలు మూతపడ్డాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అనుమతిస్తున్నారు. కరోనా వ్యాప్తి నిర్మూలనకు జులై నెల మొత్తం ఇదే పద్ధతి పాటించనున్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details