సికింద్రాబాద్ అడ్డగుట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో నడుచుకుంటూ వెళుతున్న మరో వ్యక్తిని కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ప్రతిఘటించే క్రమంలో ఇద్దరూ పరస్పర దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ పెరిగి... రక్తాలు చిందేవరకు వచ్చింది.
మద్యం మత్తులో ఘర్షణ... స్థానికుల ఆందోళన - wine effect
మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సికింద్రాబాద్ అడ్డగుట్టలో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించగా... ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆరోపించారు.

మద్యం మత్తులో ఘర్షణ... స్థానికుల ఆందోళన
ఆందోళనకు గురైన స్థానికులు... తుకారాంగేట్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసినా... చాలా సేపటి వరకు ఎవరూ రాలేదు. మళ్లీ డయల్ 100కు కాల్ చేసినా లాభం లేకుండా పోయింది. ఇక లాభం లేదని తలచిన స్థానికులే అడ్డుపడి... దాడి చేసిన వ్యక్తిని పోలీస్స్టేషన్కు తరలించారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితున్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.