అమరావతి రైతులు చేస్తున్న నిరసనలు రోజు రోజూకు పెరిగిపోతున్నాయి. ఎనిమిదోరోజూ తుళ్లూరులో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాస్కులు ధరించి వినూత్నంగా నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. రాజధాని పరిధిలోని ప్రతి గ్రామంలోని యువత, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆందోళనలు చేపట్టారు. జీఎన్ రావు కమిటీని రద్దు చేయాలంటూ యువత భారీ ఎత్తున నినాదాలు చేసింది.
మోదీ, అమిత్ షా మాస్కులతో అమరావతి రైతుల నిరసనలు - మోదీ, అమిత్ షా మాస్కులతో అమరావతి రైతుల నిరసనలు
ఎనిమిదోరోజూ రాజధాని రైతులు రోడ్డెక్కారు. గ్రామగ్రామాన ఎక్కడికక్కడే నిరసనలు కొనసాగిస్తున్నారు. తుళ్లూరులో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాస్కులు ధరించి నిరసనలు చేపట్టారు. జీఎన్ రావు కమిటీని రద్దు చెయ్యాలంటూ యువత నినాదాలు చేశారు. రోడ్డుపైనే క్రికెట్, వాలీబాల్, షటిల్, క్యారమ్స్, పిచ్చిబంతి, స్కిప్పింగ్ ఆడుతూ ఆందోళన వ్యక్తం చేశారు.
మోదీ, అమిత్ షా మాస్కులతో అమరావతి రైతుల నిరసనలు