డబ్బుంటేనే సంతోషం ఉంటుందని కొందరు భావిస్తుంటారు. ఆ సంతోషాన్ని వెతుక్కుంటూ అడ్డదారులు తొక్కుతారు. అంతిమంగా అధర్మంగా సంపాదించిన ధనం సుఖాన్ని కాదు దుఖాఃన్నే మిగులుస్తుంది. ఇందుకు నిదర్శనమే షేక్పేట మాజీ తహసీల్దార్ సుజాత కుటుంబం. అక్రమ సంపాదన పచ్చని కుటుంబాన్ని కబలించింది. ఓ అవినీతి కేసులో దొరికి పోయిన సుజాత కూడబెట్టిన సొమ్ము సర్కారు పాలుకాగా.. అవమానాలతో కుంగిపోయిన ఆమె భర్త మృత్యువు పాలయ్యారు. సస్పెన్షన్, కేసులు, భర్త ఆత్మహత్యతో అనారోగ్యానికి గురైన సుజాత.. తాజాగా గుండెపోటుతో తనువు చాలించింది.
అక్రమ సంపాదన ఓ కుటుంబాన్నే కబలించింది. అవినీతి కేసులో అరెస్టై.. కేసులు, సస్పెన్షన్లు, మానసిక వేదన, అనారోగ్యంతో షేక్పేట మాజీ తహసీల్దార్ సుజాత కుటుంబం చిన్నాభిన్నమైంది. రెండేళ్ల క్రితం బంజారాహిల్స్లోని ఓ స్థలం వ్యవహరంలో 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ షేక్పేట ఆర్ఐ నాగార్జున పట్టుబడిన కేసులో తహసీల్దార్ సుజాత హస్తముందని అవినీతి నిరోధక శాఖ తేల్చింది. ఆమె ఇంట్లో అనిశా చేసిన సోదాల్లో భారీగా నగదు లభ్యమైంది. నగదు విషయంలో తహసీల్దార్ సుజాతను మూడ్రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించారు.