తెలంగాణ

telangana

ETV Bharat / state

వరవరరావును విడుదల చేయాలని ప్రధానికి జానారెడ్డి లేఖ - former clp leader janareddy leeter to prime minister to release varavararao

భీమా కోరేగాన్​ కేసులో అరెస్టయిన వరవరరావు... కొవిడ్​తో సహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. అందుకని ఆయన్ను మధ్యంతర బెయిల్​పై విడుదల చేయాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ అమిత్​షా, రాష్ట్ర సీఎం కేసీఆర్​కు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లేఖ రాశారు.

former clp leader janareddy leeter to prime minister to release varavararao
వరవరరావు గురించి ప్రధానికి లేఖ రాసిన జానారెడ్డి

By

Published : Jul 23, 2020, 6:14 PM IST

Updated : Jul 23, 2020, 6:19 PM IST

ప్రజా కవి వరవరరావు అనారోగ్యం దృష్ట్యా ఆయన కుటుంబం ఎంతో ఆందోళన చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లేఖ రాశారు. భీమా కోరేగాన్​ కేసులో అరెస్టయిన వరవరరావు.. ప్రస్తుతం కరోనా బారిన పడి ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన లేఖలో వివరించారు.

2004లో మావోయిస్టులతో జరిగిన చర్చల్లో వరవరరావు కీలకపాత్ర పోషించారని జానారెడ్డి అన్నారు. ఆయన కొవిడ్​తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని లేఖలో తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్​పై ఆయన విడుదల చేసేందుకు చొరవ తీసుకోవాలని కోరారు.

ఇవీ చూడండి:వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం

Last Updated : Jul 23, 2020, 6:19 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details